ధ్వజారోహణం: బాబుకు తలపాగా చుట్టారు(ఫోటోలు)
తిరుమల: టీటీడీ స్ఫూర్తితో త్వరలోనే అన్ని దేవాలయాల ద్వారా విద్యాదానం చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముందుగా సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అధిరోహింపజేసి ఎగురవేశారు.
తొలుత శ్రీవారి ఉత్సవర్లయిన మలయప్పస్వామి.. ఉభయనాంచారీ సమేతుడై మధ్యాహ్నం బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగారు. బుధవారం సాయంత్రం 5.06 గంటలకు మకర లగ్న శుభవేళ శాస్త్రోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించడంతో సాలకట్ల బ్రహోత్సవాలు ఆరంభమయ్యాయి.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
టీటీడీ స్ఫూర్తితో త్వరలోనే అన్ని దేవాలయాల ద్వారా విద్యాదానం చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
తొలుత శ్రీవారి ఉత్సవర్లయిన మలయప్పస్వామి.. ఉభయనాంచారీ సమేతుడై మధ్యాహ్నం బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
బుధవారం సాయంత్రం 5.06 గంటలకు మకర లగ్న శుభవేళ శాస్త్రోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించడంతో సాలకట్ల బ్రహోత్సవాలు ఆరంభమయ్యాయి.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
తొలి వాహనంగా రాత్రి 9 గంటలకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగారు. శ్రీవారి గరుడ సేవకు రాష్ట్రం ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మాట్లాడారు. టీటీడీ యాజమాన్యం, ధర్మకర్తల మండలి, ప్రత్యేకంగా దేవస్ధానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, యావత్తు సిబ్బంది భక్తుల కోసం కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన బుధవారం రాత్రి మలయప్పస్వామి ఆదిశేషుడిపై తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభోగంగా ధ్వజారోహణం
కాగా, బుధవారం వేకువజామున 4 నుంచి ఉదయం 10 గంటల వరకు స్వామివారు విశ్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.












Click it and Unblock the Notifications