సినీ కెరీరుపైనే జూ ఎన్టీఆర్ దృష్టి
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో కలిసి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలవడంతో కొత్త రాజకీయ దుమారం తలెత్తింది. అయితే ఈ విషయాన్ని ముందుగా ఊహించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మామ నారా చంద్రబాబు నాయుడిపై దాని ప్రభావం ఉంటుందని ఆయన ఊహించలేకపోయారని అంటారు. ఆయన రోశయ్యను కలవడం వల్ల చంద్రబాబు చాలా వరకు ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. దీంతో తాను చంద్రబాబుకు దూరం కాలేదని బయటి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో మర్నాడు ఆయన చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు మరో 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.
మరో నాలుగున్నర ఏళ్లు అనేది చాలా సమయమేనని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. అప్పటి వరకు తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సినీ రంగంలో పుణికిపుచ్చుకోవాలనేది ఆయన ఆశయం. దాంతో సినిమాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. సినీ జీవితం సాఫీగా సాగిపోయి, తన కెరీర్ పెరగడానికి రాజకీయ విధేయతలు, అవిధేయతలు అడ్డు రాకుండా ఆయన చూసుకుంటున్నారని అంటున్నారు.