బాబు డ్రామా ఎన్నాళ్లు?

తీర్మాన ప్రతిపాదనకు ముందు రోశయ్య బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు ప్రాంతాల ప్రతినిధులు వెళ్లారు. ఆ సమావేశంలో పార్టీ నిర్ణయంగా తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినట్లు వార్తాకథనాలను బట్టి అర్థమవుతోంది. అలా పార్టీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు ఎలా వ్యతిరేకిస్తారనేది ప్రశ్న. గురువారం శాసనసభలో తీర్మాన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు చిందులేశారు. సమైక్యాంధ్ర నినాదం చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో కలిసి వారు తీర్మానాన్ని వ్యతిరేకించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీర్మానం ఆమోదించిన ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. రెండు ప్రాంతాలకు రెండు నాల్కలు పెట్టుకుని న్యాయం కోసం చంద్రబాబు ఎలా పోరాడుతారనేది ప్రశ్న.
చంద్రబాబుకు రెండు ప్రాంతాలు రెండు కళ్లుగా పనిచేస్తున్నాయో, లేదో గానీ రెండు ప్రాంతాలు రెండు నాలుకలుగా మాత్రం పనిచేస్తున్నాయనేది గత అనుభవమే కాకుండా తాజా సంఘటన కూడా రుజువు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ చంద్రబాబు పార్టీ నాయకులు ఇలా రెండుగా విడిపోయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారనేది కాదనలేని నిజం. తీర్మానాన్ని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రోశయ్య తమ కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పుకున్నారు. తన పార్టీ శాసనసభ్యులకు నచ్చజెప్పుకున్న తర్వాతనే ఆయన శాసనసభలో ఫ్రీజోన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు కూడా వ్యతిరేకించి ఉంటే తీర్మానం ప్రతిపాదించే వెసులుబాటు కూడా ఉండేది కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య వ్యవహరించినట్లు ఒక పెద్ద తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యవహరించకపోవడం వల్లనే సమస్యలు తీవ్రమవుతూ వస్తున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications