బాబు డ్రామా ఎన్నాళ్లు?

తీర్మాన ప్రతిపాదనకు ముందు రోశయ్య బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు ప్రాంతాల ప్రతినిధులు వెళ్లారు. ఆ సమావేశంలో పార్టీ నిర్ణయంగా తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినట్లు వార్తాకథనాలను బట్టి అర్థమవుతోంది. అలా పార్టీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు ఎలా వ్యతిరేకిస్తారనేది ప్రశ్న. గురువారం శాసనసభలో తీర్మాన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు చిందులేశారు. సమైక్యాంధ్ర నినాదం చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో కలిసి వారు తీర్మానాన్ని వ్యతిరేకించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీర్మానం ఆమోదించిన ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. రెండు ప్రాంతాలకు రెండు నాల్కలు పెట్టుకుని న్యాయం కోసం చంద్రబాబు ఎలా పోరాడుతారనేది ప్రశ్న.
చంద్రబాబుకు రెండు ప్రాంతాలు రెండు కళ్లుగా పనిచేస్తున్నాయో, లేదో గానీ రెండు ప్రాంతాలు రెండు నాలుకలుగా మాత్రం పనిచేస్తున్నాయనేది గత అనుభవమే కాకుండా తాజా సంఘటన కూడా రుజువు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ చంద్రబాబు పార్టీ నాయకులు ఇలా రెండుగా విడిపోయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారనేది కాదనలేని నిజం. తీర్మానాన్ని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రోశయ్య తమ కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పుకున్నారు. తన పార్టీ శాసనసభ్యులకు నచ్చజెప్పుకున్న తర్వాతనే ఆయన శాసనసభలో ఫ్రీజోన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు కూడా వ్యతిరేకించి ఉంటే తీర్మానం ప్రతిపాదించే వెసులుబాటు కూడా ఉండేది కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య వ్యవహరించినట్లు ఒక పెద్ద తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యవహరించకపోవడం వల్లనే సమస్యలు తీవ్రమవుతూ వస్తున్నాయి.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications