వైయస్ ఫ్యామిలీలో కలతలు

YS Rajasekhar Reddy
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆయన కుటుంబం కలిసికట్టుగా కనిపించింది. కుటుంబంలో ఏ విధమైన పొరపొచ్చాలు లేవనే విధంగా ఉండేది. కానీ, ఎమ్మెల్సీ, వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖతో కుటుంబంలోని కలతలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వైయస్ మరణంతో కాంగ్రెసు పార్టీలో వైయస్ జగన్ కు వ్యతిరేకంగా పెద్ద లాబీ గొంతు విప్పుతున్నట్లుగానే, కుటుంబంలో కూడా అసమ్మతి సెగలు బయట పడుతున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో కాంగ్రెసు గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కొత్త పరిణామాలు కాంగ్రెసులోనూ కుటుంబంలోనూ చోటు చేసుకుంటూ వచ్చాయి. రెండో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైయస్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారు. తనకు అత్యంత సన్నిహితులైనవారిని కూడా ఆయన దూరం పెట్టినట్లుగానే, రాజకీయాల్లో తనతో పాటు నడిచి వస్తున్న సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి స్థాయిని కూడా తగ్గించారు. కుమారుడు వైయస్ జగన్ కోసం వివేకానంద రెడ్డి కడప పార్లమెంటు సీటును త్యాగం చేయక తప్పలేదు. వైయస్ మరణించిన తర్వాత వైయస్ జగన్ కుటుంబ పెద్ద పాత్రను స్వీకరించారు. ఆ తర్వాతి పరిణామాలు వివేకానంద రెడ్డికి ఏ మాత్రం రుచించడం లేదని అంటున్నారు. జగన్ ను సమర్థిస్తున్నట్లు కనిపిస్తూనే ఆయన వ్యతిరేకించే వైఖరిని తీసుకున్నట్లు సోనియాకు రాసిన బహిరంగ లేఖను బట్టి అర్థమవుతోంది.

తొలిసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి కడప పార్లమెంటు సభ్యత్వానికి వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించి కుమారుడు వైయన్ జగన్ చేత పోటీ చేయించడానికి పూనుకున్నారు. ఇది వివేకానంద రెడ్డికి నచ్చలేదని చెబుతున్నారు. అయినా రాజీనామా చేయడానికి వివేకానంద రెడ్డి సిద్ధపడ్డారు. కానీ సోనియా అందుకు అంగీకరించలేదు. దీంతో వివేకానంద రెడ్డి పూర్తి కాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. తదుపరి ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి వైయస్ జగన్ కు కడప లోకసభ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. దీంతో రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వంలో పలు విషయాలను ఆయన ప్రభావితం చేస్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

వైయస్ మృతి తర్వాత పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. నిజానికి ఈ స్థానం నుంచి తానే పోటీ చేసి శాసనసభకు రావాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలని వైయస్ జగన్ భావించారు. కానీ అందుకు అధిష్టానం అంగీకరించలేదు. వైయస్ కుటుంబంలో ఒకరికి పులివెందుల టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పింది. దీంతో వైఎస్ సోదరుడు భాస్కర్‌ రెడ్డి పులివెందుల అభ్యర్థిత్వం కోసం పో టీ పడ్డారు. ఆయనతో పాటు వివేకానంద రెడ్డి కూడా అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అభ్యర్థిత్వం కోసం నేరుగా ఢిల్లీలో ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఆయనకు అభ్యర్థిత్వం దక్కలేదు. ఇది కూడా వైఎస్ కుటుంబంలో విబేధాలకు దారి తీసింది. వైఎస్ సతీమణివి జయలక్ష్మిని అభ్యర్థిగా అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఎవరూ అందుకు భిన్నంగా వ్యవహరించలేకపోయారు. ఓదార్పు యాత్రపై సోనియాకు వివరణ ఇచ్చేందుకు తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్లారు. వైఎస్ తర్వాత అప్పటికి క్రియాశీల రాజకీయాల్లో వివేకానంద రెడ్డి ఉన్నారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వివేకానందకు ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయి. సోనియాతో కూడా సత్సంబంధాలున్నాయి. అయినా తనను సోనియా వద్దకు తీసుకుపోకపోవడం పైనా వివేకానంద మనస్తాపానికి గురయ్యారని చెబుతారు. సమైక్యాంధ్ర ఉద్యమ సందంర్భంలో వైయస్ వివేకానంద రెడ్డి తీరు కూడా విభేదాలను బయటపెడుతోందని అంటున్నారు. కానీ, ఎవరు కూడా విభేదాల గురించి మాట్లాడే తెగువ ప్రదర్శించలేకపోయారు. ఒక రకంగా దాన్ని వైయస్ కుటుంబ సమస్యగానే చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+