వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదికపై అనుమానాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
నివేదిక సమర్పించే గడువు దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తెలంగాణలో అనుమానాలు పెరుగుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నివేదిక వస్తుందని శ్రీకృష్ణ కమిటీపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న కాంగ్రెసు నాయకుల్లో కూడా అనుమానాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు విషయంలో శ్రీకృష్ణ కమిటీ అపోహలకు తావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ ఇటీవల వచ్చిన వార్తాకథనాలు తీవ్ర దుమారం రేపాయి. అదే విధంగా హైదరాబాదుపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకంగా మెహతా ప్యానెల్ ను వేసింది. హైదరాబాదును ప్రత్యేకంగా ఉంచడానికి వీలవుతుందా, లేదా అనే విషయంపై మెహతా ప్యానెల్ అధ్యయనం చేస్తోంది.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సీమాంధ్ర నాయకులు విందు ఇవ్వాలని నిర్ణయించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆ విందుకు వెళ్లకూడదని వారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సూచించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తామని చెబుతున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చివరకు ఏ విధమైన కొలికి పెడతారో అనే అనుమానాలు తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు విషయంలో శ్రీకృష్ణ కమిటీ చేయబోయే సిఫార్సులపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. దానిపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ శక్తులు డిసెంబర్ తర్వాత ఆందోళన ఉధృతం చేయడానికి సమాయత్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీపై అనుమానాలు ఉండడం వల్లనే ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు బిజెపి, కాంగ్రెసు తెలంగాణ నాయకత్వం ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. శ్రీకృష్ణ కమిటీ తెంలగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించుకోవడానికి కూడా ఆందోళన చేపట్టక తప్పదనే ఉద్దేశంతో తెలంగాణ శక్తులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X