వైయస్ జగన్ ముందు చూపు
రోజాకు నగరి, అనంతలో ఫయాజ్, ధర్మవరంలో చంద్రశేఖర్ ఇలా పలుచోట్ల దాదాపు అభ్యర్థులను జగన్ ఖరారు చేశారట. అనంతపురంలో పుట్టపర్తి, మడకశిర, హిందూపూర్, రాప్తాడు, కళ్యాణదుర్గం, కదిరి, కడపలో ప్రొద్దుటూరు, కమలాపూరం, మైదుకూరులో అభ్యర్థులు ఖరారైనట్లుగా సమాచారం. విశాఖ, గుంటూరు అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చిత్తూరులో చంద్రగిరి, చిత్తూరు, సత్యవేడు, కుప్పంకు ఖరారైనప్పటికీ శ్రీకాళహస్తి తదితర కొన్ని ప్రాంతాలలో రెండు గ్రూపులు ఉండటంతో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు జగన్ అడుగుపెట్టనప్పటికీ ఈ ప్రాంతంలోనూ కొందరు ఖరారైనట్లుగా కనిపిస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, వనపర్తి, షాద్ నగర్, నారాయణపేట, అదిలాబాద్లో బోధన్, ఖమ్మం నుండి కొత్తగూడ, ఇల్లెందు, సత్తుపల్లి, కరీంనగర్ నుండి హుజురాబాద్, హుస్నాబాద్, మెదక్ నుండి గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, పటాన్ చెరు, నర్సాపూర్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు అందులోని కొన్ని నియోజకవర్గాల్లో ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎన్నికల ముందు ప్రకటించనుండగా జగన్ మాత్రం అధికారికంగా అందరినీ ప్రకటించనప్పటికీ చాపకింద నీరులా ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఓదార్పు యాత్ర వంటి తదితర సందర్భాల్లో పలువురుని వచ్చే ఎన్నికలకు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు కూడా.