వైయస్ జగన్ సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందేనా?

టిడిపి నేత ఎర్రన్నాయుడు మాట్లాడుతూ వైయస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలాది కోట్లు అక్రమంగా సంపాదించారని తాము కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. హైకోర్టు నిర్ణయం తమకు సంతృప్తిని కలిగించిందన్నారు. కోర్టులు లేకుంటే జగన్ తప్పించుకునే వారని అన్నారు. కోర్టు ద్వారానైనా జగన్ అవినీతిపరుడుని తేలుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి చీఫ్ బొత్స మాట్లాడుతూ జగన్ సిబిఐ విచారణలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. విచారణ జరగడం వల్ల జగన్కే మంచిదన్నారు. విచారణ జరిగేలా చూసి జగన్ తనపై వస్తున్న ఆరోపణలను అవాస్తవాలని నిరూపించుకునే అవకాశం వచ్చిందని సూచించారు. జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే స్టే తెచ్చుకోకూడదని సలహా ఇచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్సాఆర్ను అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారనే అపవాదు తన నిజాయితీని నిరూపించుకోవడం ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ నిరూపించుకోవాలని తాను సైతం వోక్స్ వ్యాగన్ విషయంలో నిజాయితీ నిరూపించుకున్నానని చెప్పారు. కాగా జగన్ అక్రమాస్తులు కలిగి ఉన్నాడని మంత్రి శంకర్ రావు, టిడిపి నేతలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణ, కడప జిల్లా లాయరు షేర్వాణి తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు. వారి పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన కోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications