జగన్ భయంతోనే ప్రత్యేకాధికారులు
కానీ ఈసారి మాత్రం గ్రామ సర్పంచులకు కాకుండా పర్సన్ ఇంచార్జులుగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇరవై ఒక్క వేలకు పైగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుంది. ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లను నియమించింది. ఏ పంచాయతీకి ఎవరు అనే నిర్ణయాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అయితే సర్పంచులకు కాకుండా గెజిటెడ్ ఆఫీసర్లకు ప్రత్యేకాధికారులు ప్రభుత్వం అప్పగించడం వెనుక జగన్ భయమే అని పలువురు అభిప్రాయం.
ప్రస్తుత సర్పంచుల్లో మూడొంతుల మంది కాంగ్రెసు వారే. అయితే జగన్ పార్టీ వీడి సొంత కుంపటి పెట్టాక కాంగ్రెసు సర్పంచులలో అధికమంది జగన్ వెంట వెళుతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సర్పంచులనే కొనసాగించడం ద్వారా జగన్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశ్యంతో సిఎం ప్రత్యేకాధికారుల వైపు మొగ్గినట్లు తెలుస్తోంది.