వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స విందులో పురంధేశ్వరి, బల నిరూపణా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Purandeswari
మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విందు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం మన్యం ప్రాంతంలో 2009వ సంవత్సరంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజైన బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లిన కిరణ్‌కు అక్కడి వాతావరణం సహకరించలేదు. దీంతో అతను రాజధానికి తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ శిక్షణకు హాజరైన ఎమ్మెల్యేలకు విందు ఇవ్వాలని భావించారు. సిఎం పర్యటన ఉంది కాబట్టి ఎస్.కోటలో విందు ఏర్పాటు చేయాలని బొత్స భావించారట.

అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో విందును చివరి నిమిషంలో విశాఖకు మార్చారని సమాచారం. అధ్యయన యాత్రకు వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విందులో పాల్గొన్నారు. దీంతో కొత్త సమీకరణాలకు తెరలేచినట్లయింది. బొత్స వారికి ప్రత్యేకంగా విందు ఇవ్వడం సర్వత్రా చర్చానీయాంశమయింది. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఈ విందుకు హాజరయ్యారు. విందుకు హాజరైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు బొత్సకు అభినందనలు తెలిపారు. విందు ద్వారా బొత్స తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విశాఖ వచ్చిన సిఎంను ఆయన కలుసుకోక పోవడం కూడా చర్చనీయాంశమైంది. విందులో బొత్స పార్టీ పటిష్టతను గురించి శాసనసభ్యులకు వివరించారట.

English summary
PCC chief Botsa Satyanarayana gave a dinner to newly elected mlas in Vishakapatnam. Local MP Purandeswari attended to this dinner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X