పునర్వ్యవస్థీకరణ: ఎవరు బయటకు ఎవరు లోపలకు?
ఇక సిఎం పీఠంపై కన్నేసిన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గం నుండి తప్పించాలని సిఎం భావిస్తున్నారట. పిసిసి చీఫ్గా, రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స జోడు పదవుల అంశాన్ని లేవనెత్తి ఆయనకు చెక్ చెప్పాలని సిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఖాళీగా ఉన్న కేబినెట్ పదవులకు తోడు అధిష్టానం ఆమోదించిన పక్షంలో సిఎం మరికొందరిని బయటకు పంపిస్తే పన్నెండుకు పైగా కెబినెట్ పదవులు ఖాళీ అవుతాయి. తద్వారా తనకు అనుకూలురైన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం తలూపిన పక్షంలో వరంగల్ జిల్లా నుండి గండ్ర వెంకట రమణా రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుండి కొండ్రు మురళీ, కడప జిల్లా నుండి జానీలను మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అనంతకు చెందిన జెసి దివాకర్ రెడ్డి, జగ్గారెడ్డిలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక శాఖలు సిఎం చేతుల్లోనే ఉండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే చిరు వర్గానికి చెందిన ఇద్దరితో సరిపెట్టుకోవాలని అధిష్టానం చెబుతుండటం, పునర్వ్యవస్థీకరణకు సిఎం పట్టుబడుతున్న నేపథ్యంలో విస్తరణ మరోసారి వాయిదా పడే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది.