లేఖ కలకలం: లీకేజిపై ఎవరికి వారు ఆరా
అయితే అంతకుముందు ఉదయం మాత్రం కిరణ్, బొత్స, శత్రుచర్ల విజయరామరావులపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడం లేదని ఆయన వారిపై చేస్తున్న ఆరోపణలు. రాయనున్న లేఖ విషయాన్ని పక్కన పెడితే కిషోర్ ఖచ్చితంగా లేఖ రాసి ఉంటారని అంటున్నారు. అయితే అధిష్టానం తలంటడంతో ఆతను తాను లేఖ రాయలేదని చెబుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎక్కడి నుండి లీకైంది
లేఖలో కిరణ్ బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా సరైన పని తీరు కనబర్చడం లేదని ఉండటంతో ఆ లేఖ దాదాపు పది నెలల క్రితం రాసి ఉంటారనే అభిప్రాయానికి వస్తున్నారు. అయితే అప్పటి లేఖను ఇప్పుడు బయట పెట్టడం వెనుక వ్యూహంపై ఇటు బొత్స, కిరణ్, అటు కిషోర్ వర్గంతో పాటు కాంగ్రెసు వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. లేఖ ఎక్కడి నుండి లీకైందనే చర్చ ఇప్పుడు కాంగ్రెసులో ప్రధానంగా జరుగుతోంది.
హిందూస్థాన్ టైమ్స్ వంటి ఆంగ్ల పత్రికలో ఈ లేఖ కథనం రావడంతో ఏఐసిసి స్థాయిలోనే ఈ లేఖ లీకై ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారు, బొత్స సత్తిబాబుపై వ్యతిరేకించే వర్గం ఇది బయట పెట్టి ఉండవచ్చునని అంటున్నారు. ఎక్కడి నుండి లీకైందనే విషయంపై ఎవరికి వారు ఆరా తీస్తున్నారట.