ఎన్టీఆర్ వైయస్సార్ ల మధ్య పోటీయా?

NTR-YSR
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర కొత్త మలుపు తిరిగింది. ఎన్టీఆర్, వైయస్సార్ లెగసీల మధ్య పోరాటంగా అది మారింది. ప్రకాశం కేంద్ర మంత్రి పురంధేశ్వరి, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతుల సొంత జిల్లా. ఆ జిల్లాలో పాగా వేసేందుకు జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టారు. దీంతో పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు రంగంలోకి దిగక తప్పలేదు. రాష్టంలో మహానేత ఎన్టీఆరా, వైయస్సా అనే పోటీ కూడా ముందుకొచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ కూతురు అయిన పురంధేశ్వరి ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్నా తండ్రి లెగసీ దెబ్బ తినడానికి ఇష్టపడరనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన నేతగా, పేదల పాలిట పెన్నిధిగా ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. తెలుగు సమాజంలో ఎన్టీఆర్ ను మించిన నాయకుడు లేరనే మాట కూడా వినిపిస్తోంది. ఈ సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ కు మించిన నాయకుడిగా నిలబెట్టేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే, దాన్ని కాంగ్రెసు పార్టీ పరిమితుల్లో కాకుండా తన సొంత వ్యవహారంగా జగన్ చూస్తున్నారు. దీంతో పురంధేశ్వరి దంపతులు, జగన్ మధ్య వైరం చోటు చేసుకుందని భావించాల్సి ఉంటుంది. పైగా, జగన్ కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా ఆశీస్సులు లేవు. పురంధేశ్వరికి దండిగా ఉన్నాయి. దీంతో సహజంగానే పురంధేశ్వరిది పైచేయి అవుతుంది. దాంతో జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక పురంధేశ్వరిని, దగ్గుబాటి వెంకటేశ్వర రావును తీవ్రంగా నిందిస్తూ రెండు వార్తాకథనాలు ప్రచురించిందని అంటున్నారు. వైయస్ ఎన్టీఆర్ పథకాలనే కాపీ కొట్టి పేదల ఆత్మబంధువుగా నిలబడేందుకు ప్రయత్నించారు. అయితే వాటి పేర్లు మాత్రం మార్చారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+