సత్యం రాజుకు ఎందుకింత 'ట్రీట్ మెంట్' ?
చరిత్రలో కలిసిన వైట్కాలర్ నేరాల్లో మెహతా, పరేఖ్ కేసును విచారించిన సీబీఐ స్వల్పకాలంలోనే వారికి కస్టడీ నుండి విము క్తుల్ని చేయగలిగింది. ఇక విదేశాల్లో చూస్తే, అమెరికాకు చెందిన గలియాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాజ్ రాజారత్నం, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద హెడ్జ్ ఫండ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణను అక్కడి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) చేపట్టింది. అంతపెద్ద ఎత్తున బయటపడ్డ కుంభకోణ సూత్రధారి రాజారత్నంను కేవలం రెండు రోజుల్లో బెయిల్పై విడుదల చేశారు.
తన వ్యక్తిగత పూచీకత్తుపై సుమా రు 100మిలియన్ డాలర్ల బాండ్ షరతుపై రత్నంకు బెయిల్ మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కూడా "పెద్ద" ఎత్తునే కృషి చేసి విడుదల చేయించారు. మరి సత్యం రామలింగరాజు విషయాన్నే చూస్తే, ఇక్కడి మెజిస్ట్రేట్ కోర్టు నుండి మొదలు రాష్ట్ర హై కోర్టు, సుప్రీం కోర్టు కూడా రాజు బెయిల్ పిటిషన్లను కొట్టివేశాయి. ఈ విషయంపై పలువురు కార్పొరేట్ రంగ నిపుణులు న్యాయపరమైన ప్రక్రియ వేగవంతం కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో రామలింగరాజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా అవకాశాన్ని ఇవ్వాలనీ తెలిపారు. అంతర్జాతీయంగా పూర్తిగా తన ఖ్యాతిని కోల్పోయిన సత్యం సంస్థ వ్యవహారం పూర్తి భిన్నంగా కొనసాగుతుందని ఫిక్కీ అధికారులు అంటున్నారు.