గుర్రం స్వారీలో కిందపడిన నిత్యానంద

వ్యాయామంలో భాగంగా మంగళవారం ఉదయం బిడిది సమీపంలోని ధ్యానపీటం ఆశ్రమంలో ఆయన స్వారీ చేశారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు గుర్రంపై నుంచి కిందపడటంతో నిత్యానంద కుడి చేతికి గాయమైంది. ఆశ్రమ సిబ్బంది వెంటనే ఆయనను నగరంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. నిత్యానందకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆశ్రమానికి చెందిన నిత్యసచ్చిదానంద స్వామిజీ మీడియా ప్రతినిధులకు తెలిపారు.












Click it and Unblock the Notifications