వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర బస్సులో టిడిపి తెలంగాణ బస్సు యాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

TTDP Bus Yatra
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణలోని పది జిల్లాల్లో పదిరోజుల పాటు యాత్ర చేపట్టిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమ యాత్రకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన ట్రావెల్ బస్సును వినియోగించడం విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన కేశినేని వెంకటేశ్వర రావుకు చెందిన కేశినేని ట్రావెల్స్ బస్సులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తమ బస్సు యాత్రను చేస్తున్నారు. దీనిపై పలువురు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం అంటూ సీమాంధ్ర నేతకు చెందిన బస్సు వాడటం ఏమిటని వారు ప్రశ్నించారు.

అయితే దీనికి తెలుగుదేశం పార్టీ సైతం ఘాటుగానే స్పందించింది. సీమాంధ్ర వ్యక్తికి చెందిన ట్రావెల్ బస్సులో తాము యాత్ర చేస్తే తప్పు. కానీ తెలంగాణ కోసం ఉద్యమం అంటున్న వారు అదే సీమాంధ్రులతో వ్యాపారాలు చేయడం మాత్రం తప్పు కాదా అని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తనయుడు సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావుకు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.

English summary
Telangana telugudesam party is using seemandhra leader Kesineni Venkateshwar Rao bus for their telangana yatrs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X