వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దారిలో కనిమొళీ, వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi-YS Jagan
ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటారా, అనుకోకుండానే ఒకరు మరొకరిని అనుసరిస్తారా అనేది చెప్పలేం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ డిఎంకె రాజ్యసభ సభ్యురాలిని అనుసరించారా, కనిమొళి జగన్‌ను అనుసరించారా అనేది కూడా స్పష్టంగా గుర్తు పట్టుకపోవచ్చు. కానీ, ఇద్దరు ఒకే దారిలో నడిచారని మాత్రం లోకం కోడై కూస్తోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం డబ్బులను కనిమొళి తన ప్రభుత్వేతర సంస్థలోకి, తన తల్లికి చెందిన టీవీ చానెల్ కలైంగర్‌లోకి మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. పైగా 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో సహ కుట్రదారురాలిగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి పేరును సిబిఐ చార్జిషీట్‌లో చేర్చింది.

సరిగ్గా, కనిమొళి దారిలోనే వైయస్ జగన్ నడిచారని ఆయన ప్రత్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం కూడా లేకపోలేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను పెద్దలకు కట్టబెట్టి ఆ పెద్దల ద్వారా తన సంస్థల్లో వైయస్ జగన్ పెట్టుబడులు పెట్టించుకున్నారని, తద్వారానే ఆయన దేశంలోనే అతి పెద్ద రాజకీయ కుబేరుడిగా ఎదిగారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఏయే రూపాల్లో ఎప్పుడెప్పుడు ప్రవహించాయో కూడా పత్రికలు, ప్రతిపక్షాలూ బయటపెట్టాయి. ఏమైనా, న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని అంటే అది ఎవరి తప్పూ కాకపోవచ్చు.

English summary
It is said that YSR Congress party leader YS Jagan has followed DMK leader Kanimozhi in diverting funds to his companies. It is said that Jagan using his fathers power, increased his business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X