అంబటి రాంబాబు జగన్కు దూరమేనా?

పార్టీ పెట్టిన కొత్తలో జగన్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ అంబటి రాంబాబు తళుక్కున మెరుస్తూ వచ్చారు. కానీ, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో కూడా అంబటి రాంబాబు కనిపించడం లేదు. తాజాగా, జగన్ను సమర్థిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సాక్షి దినపత్రిక కూడా ప్రచురించలేదు. జగన్కు మద్దతుగా చోటామోటా లీడర్లు మాట్లాడే మాటలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే జగన్ సాక్షి అంబటి రాంబాబు మీడియా సమావేశాన్ని కవర్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సిబిఐ జగన్కు అండగా ఉన్నవాళ్లను వేధిస్తోందంటూ ఆయన విరుచుకుపడ్డారు. చాలానే మాట్లాడారు. కానీ దానికి సాక్షి దినపత్రికలో స్థానం లభించలేదు. అంబటి రాంబాబు దీన్ని బట్టి జగన్కు దూరమైనట్లే భావిస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అని పెద్దలు ఊరికే అనలేదు మరి.












Click it and Unblock the Notifications