వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండింటి పైనే జగన్ వర్గంలో ఆశలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాబోయే ఉప ఎన్నికల దిశగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కదులుతోంది. పదకొండు జిల్లాల్లో పదిహేడు స్థానాలకు రానున్న ఉప ఎన్నికల్లో పరకాల మినహా మిగిలిన 16 స్థానాలు సీమాంధ్రలోనే ఉన్నాయి. కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటనే చర్చ అన్నివర్గాల్లో సాగుతోంది. వీరంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరూ వ్యక్తిగతంగా ఎన్నికలను ఎదుర్కొని సత్తా చూపుతామని ప్రత్యర్థులను సవాల్ చేసే పరిస్థితి లేదు. జగన్ ఎడతెగకుండా సాగిస్తున్న ఓదార్పు యాత్ర వల్ల వైయస్ సెంటిమెంట్ ఇప్పటికీ సజీవంగా ఉందని, ఇది రాబోయే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ విభేదాలు, సమన్వయ లోపాలు తమకు కలిసివచ్చే అంశాలని వారు బహిరంగంగానే చెబుతున్నారు. గుంటూరులో ఓదార్పుయాత్ర ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న జగన్‌ను కొందరు నేతలు ఆయన నివాసంలో కలిశారు. ఉప ఎన్నికలకు ఎలా వెళ్లాలో అనే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, YS Congress party chief YS Jaganmohan Reddy camp leaders are confident on sentiment and differences in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X