మళ్లీ ఫాంహౌస్కు కెసిఆర్: ఒత్తిడికి వ్యూహరచన

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ తెరాసను ఖంగుతినిపించింది. దీంతో త్వరలో జరగనున్న పరకాల నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. అక్కడా బిజెపియే గెలిస్తే పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరకాలలో గెలవడానికి కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారట.
మరోవైపు కేంద్రం తెలంగాణపై ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఓ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయ. కేంద్రం ప్రధానంగా ప్రత్యేక ప్యాకేజీపై దృష్టి సారిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలని కెసిఆర్ ఫాంహౌస్లో కూర్చొని పథకం తయారు చేస్తున్నారట.
భవిష్యత్తులో తెలంగాణ కోసం కేంద్రంలో ఎలా హీటెక్కించాలనే అంశాన్ని కెసిఆర్ తన ఫాం హౌస్లోని పచ్చని చెట్ల కింద సేద తీరుతూ ఆలోచిస్తున్నారట! ఆయన అక్కడ కుదిరితే చదవడం లేదంటే పచ్చని చెట్ల మధ్య తిరుగుతూ గడుపుతున్నారట. వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నారట. మరి తోట బంగ్లాలో భవిష్యత్తు ప్రణాళిక రచిస్తున్న కెసిఆర్ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications