వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ప్రకటిస్తే, వైయస్ జగన్‌పై ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసును ఎదుర్కోవడానికి మూడో ప్రాంతీయ పార్టీకి తమకు ఎంత నష్టమో చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా అర్థం చేసుకున్న ఆయన వైయస్ జగన్ పార్టీని వచ్చే ఎన్నికల్లోగా ఇరకాటంలో పెట్టే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేస్తూ తమ పార్టీకి వివిధ వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

బీసీ డిక్లరేషన్ ద్వారా ఇప్పటికే కొంత మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అంశంపై జగన్‌పై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉన్నారు. మరో అంశంపై కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇరకాటంలో పెట్టినట్లే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలపడం ద్వారా ఆ పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మాల నాయకుల ప్రాబల్యం ఉంది. దీంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో ఎస్సీల్లోని మాదిగలను తన వైపు తిప్పుకోవడానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

అన్నింటి కన్నా ముఖ్యమైంది ఇప్పుడు తెలంగాణ అంశం. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారనే మాట వినిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇస్తే జగన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలంగాణవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు ప్రకటన చేస్తే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే తమ నిర్ణయాలను వెల్లడించాల్సి ఉంటుంది.

చంద్రబాబు ప్రకటన చేస్తే అటు కాంగ్రెసు పార్టీయే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఇరకాటంలో పడి తమ వైఖరులను వెల్లడించాల్సిన అనివార్యతలో పడుతాయి. ఆ పార్టీలు తర్జనభర్జనలు చేసేలోగా తెలంగాణలో తమ బలాన్ని కూడగట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లభిస్తుంది. ఏమైనా, చంద్రబాబు అపర చాణుక్యుడనే విషయాన్ని మరోసారి నిరూపించుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

English summary
Pressure will be mount on YSR Congress president YS Jagan, if Telugudesam president N Chandrababu Naidu makes pro Telangana statement. Chandrababu is saying he will give clarity on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X