రామోజీ ఈటీవీతో ముకేష్ లింక్స్ వెల్లడి

మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిటర్లకు వందలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సమయంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రామోజీ రావుకు సహాయం చేసిందనేది విజయమ్మ ఆరోపణ. నిలేష్ కంపానీ పేరు మీద కంపెనీలను స్థాపించి, రియలన్స్ ఈనాడు గ్రూపులోకి నిధులు మళ్లించిందని విజయమ్మ ఆరోపించారు. కృష్ణా - గోదావరి బేసిన్ బిడ్డింగ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సహాయం చేసినందుకే రామోజీకి రిలయన్స్ పెట్టుబడులు తరలించిందనేది విజయమ్మ చేసిన ఆరోపణ. ఏమైనా, దీన్ని వైయస్ జగన్ వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications