ఢిల్లీ పెద్దకు ఎంపీ నిలదీత: అప్పుడేం చేశారని షిండే

విభజనపై గతంలోను ఇలాగే వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని, ప్రజలంతా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం కోసం ఎవరూ అడగడం లేదని చాకోను ఒకింత నిలదీసినట్లుగానే అడిగారట. పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతం అంటే ప్రజలు అంగీకరించరని, చేస్తే శాశ్వతంగా యుటి చేయాలని.. అలా చేస్తే తెలంగాణవాళ్లు అంగీకరిస్తారా, ఇన్ని సమస్యల నేపథ్యంలో విభజన ఏలా సాధ్యమని ప్రశ్నించారట.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ఇదివరకేం చేశారని ప్రశ్నించారు. ఆయనను సీమాంధ్ర ఎంపీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం అని వస్తున్న మీరు ఇది వరకు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఏ ఉద్యమాలు లేవని వ్యాఖ్యానించారట.
అందుకు ఎంపీలు స్పందిస్తూ.. కలిసుండాలనే ఉద్దేశ్యంతో తాము ఎలాంటి ఆందోళనలకు దిగలేదని, సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని ఎలా బతికిస్తారని, రెండుసార్లు రాష్ట్ర ప్రజలు ఓటేయడం వల్ల అందరం ఇక్కడున్నామని, అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా విభజన ఎలా చేస్తారని ఎంపీలు ప్రశ్నించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications