జయప్రదను దువ్వుతున్న కమలదళం?
రాజమండ్రిలో బిజెపి బలం దృష్ట్యా ఆమె ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఉండవల్లి రాజమండ్రి సీటు నుంచి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు బిజెపి ఈ సీటును గెలుచుకుంది. గిరజాలల వెంకటస్వామి నాయుడు, ఆ తర్వాత సిబిపిబికె సత్యనారాయణ రావు బిజెపి తరఫున పోటీ చేసి గెలిచారు.
రాజమండ్రి సీటులో బిజెపికి గెలిచిన చరిత్ర ఉండడంతో జయప్రద ఆ పార్టీలో చేరే ఆలోచన కూడా చేయవచ్చునని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కన్నా జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరితే బాగుంటుందనే ఆలోచన కూడా ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు.
తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని జయప్రద కచ్చితంగా చెప్పడంతో ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు తప్ప ప్రత్యామ్నాయం లేదని అందరూ భావించినప్పటికీ తాజాగా బిజెపి ప్రత్యామ్నాయం ఆమెకు కనిపిస్తోందని అంటున్నారు. బిజెపి బలం, తన ఇమేజ్ రెండూ కలిసి తాను విజయం సాధించే అవకాశాలున్నాయని జయప్రద అనుకంటున్నట్లు కూడా తెలుస్తోంది.