బాబు అప్పుడు, ఇప్పుడు అంతే!: డిగ్గీ అసహనం

తెలుగుదేశం పార్టీ విభజన విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. ఆంటోని కమిటీని కాంగ్రెసు కమిటీ అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే భేటీకి రాననడం ఏమిటని ప్రశ్నించారు! జివోఎం ఏర్పాటు పైన కూడా టిడిపి ఇలాగే వ్యవహరించిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే రాష్ట్ర ఏర్పాటు జరుగుతోందన్నారు.
అదే సమయంలో కెసిఆర్కు సూచనలు చేశారు. కెసిఆర్ పలు డిమాండ్లు ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిగ్గీ స్పందించారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వారికి ఏవైనా డిమాండ్లు ఉంటే మంత్రుల బృందానికి చెప్పాలని సూచించారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. సీమాంధ్రలో అల్లర్లను చల్లార్చే బాధ్యత జివోఎంకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్కు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని కానీ, మాట్లాడే విషయంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారన్న టిడిపి వ్యాఖ్యలను డిగ్గీ కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications