పిసిసి చీఫ్గా బొత్స అవుట్: కన్నా ఇన్?

సోనియాగాంధీనే కన్నాను పిలిపించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని, తద్వారా రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గాన్ని తన వైపు పూర్తి స్థాయిలో మళ్లించుకోవడం ద్వారా ఎక్కువ స్థానాలు సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉందని చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. ప్రస్తుత పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సాంకేతికంగా బిసి వర్గానికి చెందిన తూర్పు కాపు. అయితే, మానసికంగా కాపు గానే భావిస్తున్నారు.
అయితే అసలు కాపులకు తూర్పు కాపులకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించిన నాయకత్వం, కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గంలో ఇమేజ్ ఉన్న కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వనుందన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది. రెడ్డి, క్రైస్తవ, దళిత క్రైస్తవ, మైనారిటీలో కొంతభాగం జగన్ పార్టీవైపు చూస్తున్న నేపథ్యంలో బలమైన కాపు వర్గాన్ని తమ వైపు ఆకర్షించాలన్న వ్యూహంలో భాగంగానే నాయకత్వం కన్నాను పిలిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనేకసార్లు కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి చేజారిపోయింది. రెండుసార్లు ఎం.సత్యనారాయణరావు, బొత్స పిసిసి అధ్యక్షులైన సమయాల్లో కూడా కన్నా పేరు ముందు వరసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసమే ఆమె నివాసానికి వెళ్లానని, సోనియాను కలవలేదని కన్నా మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications