మీ ఎంపీలే గట్టిగా ఫైట్ చేయట్లేదన్న జాతీయ నేత
సమైక్యాంధ్ర ప్రదేశ్కు మద్దతివ్వాలని కోరారు. విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వారితో చెప్పారు. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా మీ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులే గట్టిగా మాట్లాడటం లేదని, మీరు వారి పైన ఒత్తిడి తీసుకు రావాలని, తాము మద్దతుగా ఉంటామని సూచించారట కూడా.
ఎన్ఎంయు నేతలు సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో పలువురు ముఖ్యనేతలను కలుస్తున్నారు. ఈ రోజు వారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలువనున్నారు. సీమాంధ్ర ఉద్యమం గురించి వారు ఆయనకు వివరించనున్నారు. తాము కలిసిన నేతలకు వారు సీమాంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉందని చెబుతున్నారు.
కాగా, రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి సభలో నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెసు ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు టిడిపి సభ్యులు సమైక్యాంధ్ర కోసం కాకుండా సీమాంధ్రకు న్యాయమంటూ డ్రామాలాడుతున్నారని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆరోపిస్తున్నాయి.