రెండు చోట్ల నరేంద్ర మోడీ: అలిగిన ఎల్కె అద్వానీ

గాంధీ నగర్నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బిజెపి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తీసుకున్న నిర్ణయంపై పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ స్పందించ లేదు. గాంధీనగర్నుంచే పోటీ చేసేలా అద్వానీని ఒప్పించండం కోసం బిజెపి సీనియర్ నాయకులైన మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు అద్వానీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
బుధవారం రాత్రి 11 గంటల వరకు కూడా అద్వానీతో చర్చలు కొనసాగినప్పటికీ ఆయన మాత్రం గాంధీ నగర్నుంచి పోటీ చేయడంపై స్పష్టంగా ఏమీ చెప్పలేదని తెలిసింది. అద్వానీతో చర్చలు జరిపిన అనంతరం గడ్కరీ, సుష్మాస్వరాజ్లు బైట వేచి ఉన్న మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. తనకు ఎట్టి పరిస్థితుల్లోను భోపాల్ సీటే కావాలని అద్వానీ పట్టుబడుతున్నారు.
కాగా, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి, వడోదర రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు. హేమమాలిని (మధుర), రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (జైపూర్), జగదాంబికా పాల్ (దొమారియాగంజ్)లు పోటీ చేయనున్నారు. రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన హేమమాలిని అభ్యర్థిత్వాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications