మైనంపల్లి తిప్పలు: సైకిల్ కాదు, కారు
హైదరాబాద్: మైనంపల్లి హనుమంతరావు సైకిల్ దిగి కారు ఎక్కారు. ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. దీంతో తాను పోటీ చేస్తున్న మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం జై తెలంగాణ నినాదాలు చేస్తూ, కారు గుర్తును ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
మైనంపల్లి హనుమంతరావును మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం ప్రజలు సైకిల్ గుర్తుతోనే ఎక్కువగా గుర్తిస్తారు. గతంలో రెండు సార్లు మల్కాజిగిరి శాసనసభా నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తుపై గెలిచారు. దాంతో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు పడేలా చూడడానికి మైనంపల్లి అనుచరులు తిప్పలు పడుతున్నారు.

నిజానికి తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, అయితే మల్కాజిగిరి శాసనసభ టికెట్ తనకు మళ్లీ ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, అయితే ఆ సీటును బిజెపికి కేటాయించారని, తాను తెరాస నుంచి పోటీ చేస్తానని ఏ రోజు కూడా అనుకోలేదని మైనంపల్లి అంటున్నారట.
మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఆయన లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డిని ఎదుర్కుంటున్నారు. మైనంపల్లి ఈ నియోజకవర్గంలో చెమటోడ్చక తప్పదు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications