అందుకే మోడీని అభినందించలేదన్న రాజపక్ష

ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా మోడీని అభినందిస్తానని అన్నారు. మోడీ తన పుట్టిన రోజు నాడు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్తో బీజీగా ఉన్నారని, అలాంటి సమయంలో డిస్టర్బ్ చేయవద్దనే విష్ చేయలేదని రాజపక్ష బీజేపీ నేతలకు చెప్పారు. రాజపక్షతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మురళీధర రావు అన్నారు.
ప్రధానంగా తమిళజాతుల సమస్యపై మనసు విప్పి మాట్లాడారన్నారు. తమిళ్ నేషనల్ అలయన్స్తో చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరినట్టు తెలిపారు. ప్రాంతీయ సాంస్కృతిక పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కోరామన్నారు.












Click it and Unblock the Notifications