మా అమ్మ ఓటు నేను వేయొచ్చా: మోహన్బాబు
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో ఓటు వేసే సమయంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు హంగామా చేశారు. తన అమ్మ వయో వృద్ధురాలని, ఆమె నడవలేని స్థితిలో ఉన్నారని ఆమె ఓటు తాను వేయొచ్చనా అని ఆయన పోలింగ్ నిర్వహణాధికారిని అడిగారు.
అలా వేయడానికి వీలు లేదని అధికారి సమాధానమిచ్చారు. ఆమెను పోలింగ్ బూత్కు తీసుకొచ్చి, ఆమెను ఈవీఎం వద్దకు తీసుకెళ్లి, ఆమె చెప్పిన గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అధికారి సూచించారు. దీంతో మోహన్ బాబు తన తల్లితో ఓటు వేయించారు.

సీమాంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా మోహన్ బాబు తన సొంత ఊరు రంగంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ బాబుతో పాటు కుమారుడు మంచు విష్ణు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మనకు నిరంతరం అందుబాటులో ఉండే నేతకు ఓటు వేయాలంటూ పలువురు మహిళా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత తన కుమారుడు మంచు విష్ణు, తల్లితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications