కాంగ్రెస్ ఆందోళనలో రాష్ట్రపతి కూతురు షర్మిష్ఠ
దేశ రాజధానిలో విద్యుత్తు కోతల పైన శనివారం కాంగ్రెసు పార్టీ చేపట్టిన నిరసనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠా ముఖర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను కాంగ్రెసు పార్టీలో భాగస్వామినేనని చెప్పారు. గత పదిహేనేళ్లుగా ఈ స్థాయిలో విద్యుత్తు కోతలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
అందుకే ఢిల్లీ నగర పౌరురాలిగా ఈ ఆందోళనకు మద్దతు తెలపడం తన బాధ్యత అన్నారు. ఆందోళనను హక్కుగా కూడా భావిస్తున్నానని చెప్పారు. ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్తు సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, ఢిల్లీలో విద్యుత్తు కోతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో షర్మిష్ఠా ముఖర్జీ పాల్గొన్నారు. దేశ రాజధానిలోని విద్యుత్తు కోతల పైన బిజెపి ప్రభుత్వం సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications