బాబుకు షాక్?: తలసాని రాలేదు, కృష్ణయ్య నిలదీత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకివ్వనున్నారా, అలాగే, బీసీ నేత, పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా ఝలక్ ఇస్తున్నారా! అంటే కావొచ్చునంటున్నారు.
శనివారం టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి సనత్నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ గైర్జాజరుకావడం చర్చనీయాంశమైంది. ఆయనతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. ఆయన తెరాసలో చేరుతున్నారని ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల బోనాల జాతర సమయంలోను ఆయన కేసీఆర్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన టీటీడీపీకి దూరంగా జరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదని మరికొందరు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఫీజు రీయింబర్స్మెంట్కు సంబందించిన ఓ సమావేశంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
అయితే, ఆర్ కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెబుతారని గతంలో ప్రచారం సాగింది. అందులో నిజమెంతో తెలియనప్పటికీ.. శనివారం ఫీజు రీయింబర్సుమెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణయ్య.. ఏపీ సీఎం అయిన తమ పార్టీ అధినేత తీరును ఒకింత తప్పు పట్టారు. 58, 42 పర్సెంట్ ప్రకారం ఏపీ, టీఎస్ రాష్ట్రాలు ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించాలన్న చంద్రబాబు ప్రతిపాదన సరికాదని ఆర్ కృష్ణయ్య బాంబు పేల్చారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications