బాబుకు షాక్?: తలసాని రాలేదు, కృష్ణయ్య నిలదీత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకివ్వనున్నారా, అలాగే, బీసీ నేత, పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా ఝలక్ ఇస్తున్నారా! అంటే కావొచ్చునంటున్నారు.
శనివారం టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి సనత్నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ గైర్జాజరుకావడం చర్చనీయాంశమైంది. ఆయనతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. ఆయన తెరాసలో చేరుతున్నారని ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల బోనాల జాతర సమయంలోను ఆయన కేసీఆర్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన టీటీడీపీకి దూరంగా జరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదని మరికొందరు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఫీజు రీయింబర్స్మెంట్కు సంబందించిన ఓ సమావేశంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
అయితే, ఆర్ కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెబుతారని గతంలో ప్రచారం సాగింది. అందులో నిజమెంతో తెలియనప్పటికీ.. శనివారం ఫీజు రీయింబర్సుమెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణయ్య.. ఏపీ సీఎం అయిన తమ పార్టీ అధినేత తీరును ఒకింత తప్పు పట్టారు. 58, 42 పర్సెంట్ ప్రకారం ఏపీ, టీఎస్ రాష్ట్రాలు ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించాలన్న చంద్రబాబు ప్రతిపాదన సరికాదని ఆర్ కృష్ణయ్య బాంబు పేల్చారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications