ఫ్యాన్స్ ఎన్నిసార్లు అడిగినా, బాలకృష్ణకు బాబు నో!
అమరావతి: అమరావతిలో శనివారం నాడు భూమిపూజ కార్యక్రమంలో హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను మాట్లాడాలని అభిమానులు కోరారు. అయితే, అభిమానుల కోరిక నెరవేరలేదు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వారి కోరికను పట్టించుకోలేదు.
అంతకుముందు భూమిపూజ కోసం బాలకృష్ణ వచ్చినప్పుడు స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భూమిపూజ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అప్పటి నుండి పెద్ద ఎత్తున అభిమానులు బాలకృష్ణతో మాట్లాడాలించాలని కోరారు.
కానీ, చంద్రబాబు వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని అంటున్నారు. వారు పదేపదే బాలకృష్ణతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తన ప్రసంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, తాను మరియు ఎన్టీఆర్ హైదరాబాద్, తెలుగు ప్రజల కోసం చేసిన కృషి గురించి చెప్పినప్పుడు కూడా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున స్పందించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం శనివారం నాడు జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం గం.8.49 నిమిషాలకు రాజధాని కోసం భూమి పూజ చేశారు. భూమిపూజలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications