ఫ్యాన్స్ ఎన్నిసార్లు అడిగినా, బాలకృష్ణకు బాబు నో!
అమరావతి: అమరావతిలో శనివారం నాడు భూమిపూజ కార్యక్రమంలో హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను మాట్లాడాలని అభిమానులు కోరారు. అయితే, అభిమానుల కోరిక నెరవేరలేదు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వారి కోరికను పట్టించుకోలేదు.
అంతకుముందు భూమిపూజ కోసం బాలకృష్ణ వచ్చినప్పుడు స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భూమిపూజ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అప్పటి నుండి పెద్ద ఎత్తున అభిమానులు బాలకృష్ణతో మాట్లాడాలించాలని కోరారు.
కానీ, చంద్రబాబు వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని అంటున్నారు. వారు పదేపదే బాలకృష్ణతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తన ప్రసంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, తాను మరియు ఎన్టీఆర్ హైదరాబాద్, తెలుగు ప్రజల కోసం చేసిన కృషి గురించి చెప్పినప్పుడు కూడా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున స్పందించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం శనివారం నాడు జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం గం.8.49 నిమిషాలకు రాజధాని కోసం భూమి పూజ చేశారు. భూమిపూజలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
-
326A జాతీయ రహదారిపై కేంద్రమంత్రి తీపికబురు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications