ఎర్ర చీమలు బ్రేకు వైర్లని కొరికాయి, రైలు ఆగిపోయింది
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై లోకల్ రైలు బ్రేకు వైర్లను ఎర్ర చీమలు కొరికి వేసిన సంఘటన... విచారణలో వెలుగు చూసింది. ఎర్ర చీమల వల్ల లోకల్ రైలుకు చిక్కులు వస్తున్నాయి. ఓ రైలులో ప్రధాన ఈపీ బ్రేకుతో అనుసంధానమై ఉండే ప్రైమరీ బ్రేక్ వైర్లను అవి కొరికేశాయి.
ఈ ఘటన మంగళవారం నాడు జరిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారి వెల్లడించారు. ప్రైమరీ బ్రేక్ వైర్లు విడివడి ఉండటాన్ని రైలు సిబ్బంది గమనించారు. దీని ప్రభావం వల్ల ఈపీ బ్రేక్లు సరిగా పని చేయలేదు. దీంతో అత్యవసర (ఎమర్జెన్సీ) బ్రేకులను ఉపయోగించి రైలును ఆపేశారు.

ఆ సమయంలో ప్రయాణీకులు లేరు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఎక్సామినేషన్ కోసం ఆ లోకల్ రైలును కుర్లా కార్ షెడ్కు పంపించారు. అక్కడే.. ఎర్ర చీమల వల్ల బ్రేకు వైర్లు ఫెయిల్ అయ్యాయని తేలింది.
ఆ లోకల్ రైలు.. కళ్యాణ్ నుంచి వచ్చింది. మంగళవారం ఉదయం గం.11.47 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్కు వచ్చింది. ఆ తర్వాత మాతుంగ స్టేషన్ చేరాక బ్రేకులలో సమస్య వచ్చింది. అత్యవసర బ్రేకులను ఉపయోగించి ఆపారు. కుర్లా షెడ్ తరలించారు. అక్కడ తెరిచి చూడగా... ఎర్ర చీమలు కనిపించాయి.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications