ఎర్ర చీమలు బ్రేకు వైర్లని కొరికాయి, రైలు ఆగిపోయింది
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై లోకల్ రైలు బ్రేకు వైర్లను ఎర్ర చీమలు కొరికి వేసిన సంఘటన... విచారణలో వెలుగు చూసింది. ఎర్ర చీమల వల్ల లోకల్ రైలుకు చిక్కులు వస్తున్నాయి. ఓ రైలులో ప్రధాన ఈపీ బ్రేకుతో అనుసంధానమై ఉండే ప్రైమరీ బ్రేక్ వైర్లను అవి కొరికేశాయి.
ఈ ఘటన మంగళవారం నాడు జరిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారి వెల్లడించారు. ప్రైమరీ బ్రేక్ వైర్లు విడివడి ఉండటాన్ని రైలు సిబ్బంది గమనించారు. దీని ప్రభావం వల్ల ఈపీ బ్రేక్లు సరిగా పని చేయలేదు. దీంతో అత్యవసర (ఎమర్జెన్సీ) బ్రేకులను ఉపయోగించి రైలును ఆపేశారు.

ఆ సమయంలో ప్రయాణీకులు లేరు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఎక్సామినేషన్ కోసం ఆ లోకల్ రైలును కుర్లా కార్ షెడ్కు పంపించారు. అక్కడే.. ఎర్ర చీమల వల్ల బ్రేకు వైర్లు ఫెయిల్ అయ్యాయని తేలింది.
ఆ లోకల్ రైలు.. కళ్యాణ్ నుంచి వచ్చింది. మంగళవారం ఉదయం గం.11.47 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్కు వచ్చింది. ఆ తర్వాత మాతుంగ స్టేషన్ చేరాక బ్రేకులలో సమస్య వచ్చింది. అత్యవసర బ్రేకులను ఉపయోగించి ఆపారు. కుర్లా షెడ్ తరలించారు. అక్కడ తెరిచి చూడగా... ఎర్ర చీమలు కనిపించాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications