ఎర్ర చీమలు బ్రేకు వైర్లని కొరికాయి, రైలు ఆగిపోయింది
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై లోకల్ రైలు బ్రేకు వైర్లను ఎర్ర చీమలు కొరికి వేసిన సంఘటన... విచారణలో వెలుగు చూసింది. ఎర్ర చీమల వల్ల లోకల్ రైలుకు చిక్కులు వస్తున్నాయి. ఓ రైలులో ప్రధాన ఈపీ బ్రేకుతో అనుసంధానమై ఉండే ప్రైమరీ బ్రేక్ వైర్లను అవి కొరికేశాయి.
ఈ ఘటన మంగళవారం నాడు జరిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారి వెల్లడించారు. ప్రైమరీ బ్రేక్ వైర్లు విడివడి ఉండటాన్ని రైలు సిబ్బంది గమనించారు. దీని ప్రభావం వల్ల ఈపీ బ్రేక్లు సరిగా పని చేయలేదు. దీంతో అత్యవసర (ఎమర్జెన్సీ) బ్రేకులను ఉపయోగించి రైలును ఆపేశారు.

ఆ సమయంలో ప్రయాణీకులు లేరు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఎక్సామినేషన్ కోసం ఆ లోకల్ రైలును కుర్లా కార్ షెడ్కు పంపించారు. అక్కడే.. ఎర్ర చీమల వల్ల బ్రేకు వైర్లు ఫెయిల్ అయ్యాయని తేలింది.
ఆ లోకల్ రైలు.. కళ్యాణ్ నుంచి వచ్చింది. మంగళవారం ఉదయం గం.11.47 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్కు వచ్చింది. ఆ తర్వాత మాతుంగ స్టేషన్ చేరాక బ్రేకులలో సమస్య వచ్చింది. అత్యవసర బ్రేకులను ఉపయోగించి ఆపారు. కుర్లా షెడ్ తరలించారు. అక్కడ తెరిచి చూడగా... ఎర్ర చీమలు కనిపించాయి.












Click it and Unblock the Notifications