పిచ్ కొట్లాట: హాగ్ను తిప్పికొట్టిన అశ్విన్
న్యూఢిల్లీ: భారత ఏస్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ రోడ్నీ హాగ్ల మధ్య పిచ్ కొట్లాట సాగుతోంది. స్పిన్కు సహకరించే పిచ్లపై విజయం సాధించడం గొప్ప విషయమేం కాదని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీలు మైకేల్ వాన్, మాథ్యూ హేడెన్లు చేసిన విమర్శలను రోడ్నీ హాగ్ సమర్థించాడు
"ఐసీసీ, బీసీసీఐ, అశ్విన్! అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు తీసిన వికెట్లు స్పిన్కు సహకారం అందించే పిచ్ వల్ల మాత్రమే వచ్చాయి అని తెలుస్తుంది" అని రోడ్నీ ట్విట్టర్లో విమర్శించాడు.
దీన్ని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పికొట్టాడు. "తప్పకుండా చూసుకుంటాం. అలాగే మీరు కూడా ఓసారి అద్దం ముందు నిలబడితే మీరేం చేశారో తెలుస్తుంది అని గతంలో మీకు సహకరించేలా పిచ్లు తయారుచేసుకున్నారం"టూ దీటుగా బదులిచ్చాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ 2-0 స్కోరుతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా అశ్విన్ ఘనత సాధించాడు. అతను 24 వికెట్లు తీశాడు.