ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటికి టోకరా?
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన కోట్ల రూపాయల స్థలాన్ని కొందరు వ్యక్తులు తమదేనంటూ మరొకరికి కుటుంబ సభ్యుల పేరుతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని వార్తలు వచ్చాయి.
కంభంపాటి మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న కంపెనీకి చెందిన పదకొండున్నర ఎకరాల ఖాళీ స్థలం విశాఖలోని మర్రిపాలెం సర్వే నెంబర్ 59, 59లో ఉంది. అయితే, ఈ స్థలాన్ని మరొకరికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని కంభంపాటి స్వయంగా ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనకు సంబంధించి అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేశారు. ఈ స్థలాన్ని కంభంపాటి పదకొండేళ్ల క్రితం కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే, దీనిని కొందరు వ్యక్తులు గత నెల 23న నలుగురు వ్యక్తులకు కుటుంబ సభ్యుల పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications