అనుష్క దూరం: విరాట్ కోహ్లీ హార్ట్ బ్రేకింగ్(ఫొటో)
ముంబై: ప్రేమ పావురాల్లా గత కొంతకాలంగా చట్టాపెట్టాలేసుకుని తిరిగిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా సమాచారం. ఇందుకు విరాట్ కోహ్లీ చేసిన వివాహ ప్రతిపాదనే కారణమని కూడా తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ.. ఈ ఏడాదే పెళ్లి చేసుకుందామని చెప్పగా.. అనుష్క ఇందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. ఆమెకు దూరమయ్యాడు. అనుష్క కూడా కోహ్లీకి దూరంగానే ఉంటూ తను నటించే బాలీవుడ్ చిత్రాల్లో బిజీ అయిపోయింది.

కాగా, విరాట్ కోహ్లి మనసు మాత్రం ఇంకా అనుష్క చుట్టూనే తిరుగుతున్నట్టుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం హృదయం ముక్కలైందంటూ కోహ్లి ఓ వ్యాఖ్య రాసి తన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు.
తర్వాత ఏమైందో గానీ వెంటనే ఆ ఫొటోను తొలగించాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. దీంతో తొలగించిన ఆ ఫొటోను మళ్లీ పెట్టాడు. ‘ఆ ఫొటోను తీసేసి నేనేదో నేరానికి పాల్పడినట్లుంది. క్షమించండి. ఇదిగో మళ్లీ పెడుతున్నా' అంటూ రాసుకొచ్చాడు.
మరోవైపు శనివారం రాత్రి ఓ నైట్క్లబ్లో జరిగిన బాలీవుడ్ నటుడు అంగద్ బేడి పుట్టినరోజు పార్టీకి హాజరైన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘నేను ఇప్పుడు ఒంటరిని. నాతో నృత్యం చేయండి' అని పార్టీకి వచ్చిన వారితో కోహ్లి అన్నాడని తెలిసింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications