గోపిచంద్ అకాడమీ భూములపై వైఎస్ కన్ను? లాక్కుందామనుకున్నారా?
హైదరాబాద్ : మొన్న సైనా.. నేడు సింధు.. గోపిచంద్ శిష్యరికంలో ఆరితేరి ఒలింపిక్స్ లో ఇండియాకు పతకాలు అందించిన ప్రతిభాశీలులు. ఇలాంటి మెరికల్లాంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలను తయారు చేయడానికి కోచ్ గోపిచంద్ చూపిన చొరవ విస్మరించరానిది. క్రికెట్ ఫీవర్ తో ఊగిపోయే దేశంలో బ్యాడ్మింటన్ కూ ఓ ప్రత్యేక స్థానం కల్పించేలా చేయడంలో ఆయన శ్రమ చాలానే ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా అకాడమీ ప్రారంభించడానికి గోపిచంద్ చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గోపిచంద్ అకాడమీ కోసం గచ్చిబౌలి ప్రాంతంలో ఐదెరకాల స్థలాన్ని కేటాయించింది. స్థలంతో పాటు 25లక్షల నగదును కూడా అందజేసింది. అయితే అకాడమీ నిర్వహణకు ఆ డబ్బు అరకొరగానే మారడంతో.. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి రూ.5కోట్లను గోపిచంద్ విరాళంగా పొందారు.
ఆ విరాళంతో పాటు తన ఇంటిని కూడా అమ్మేసుకున్న గోపిచంద్.. మొత్తంగా ఆర్థిక అవాంతరాలన్నింటినీ చేధించుకుంటూ అకాడమీ ప్రారంభించారు. అయితే అకాడమీ ప్రారంభమైన రెండేళ్ల కాలానికి 2005లో వైఎస్ అధికారంలోకి రావడంతో.. ఆయన కన్ను గోపిచంద్ అకాడమీ భూముల మీద పడినట్లుగా కొన్ని ఆరోపణలున్నాయి. అప్పట్లో గచ్చిబౌలి ప్రాంతంలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతుండడంతో.. అకాడమీకి కేటాయించిన ఐదెకరాల్లో మూడు ఎకరాలను కోత పెట్టాలని భావించారట వైఎస్.

ఇదే విషయంపై అకాడమీ భూముల స్వాధీనానికి అప్పట్లో ప్రభుత్వం ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించిన గోపిచంద్.. జీవో పై 'స్టే' తెచ్చుకున్నారు. అనంతరం రోశయ్య సీఎంగా వ్యవహరించిన కాలంలోను ఆ జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా గోపిచంద్ ప్రయత్నాలు చేయగా ఆయన ప్రయత్నాలేవి సఫలం కాలేదు.
ఆ తర్వాత ఆ జీవో విషయం ఏమైందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. మరి ఇప్పటికీ.. ఆ జీవో అలానే ఉందా..? ఒకవేళ ఉంటే ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వమైనా దాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తుందా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications