జాన్వీ కపూర్ ఇష్టపడే రాయలసీమ స్పెషల్ రెసిపీ.. ఇలా ఈజీగా చేసుకోండి..
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాలీవుడ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టిందీ బ్యూటీ. అయితే ఇటీవల ఓ షో లో పాల్గొన్న జాన్వీ తనకు రాయలసీమ ఫేమస్ రెసిపీ అయిన రాగి ముద్ద చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.
మరి ఫేమస్ రెసిపీ అయిన రాగి ముద్దను ఎలా తయారు చేయాలి..? కావల్సిన పదార్థాలు ఏంటి..? రాగి ముద్ద తయారీకి ముందుగా రేషన్ బియ్యం రెండు కప్పులు, నీళ్లు తగినన్ని, ఉప్పు రుచికి సరిపడా, రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి.

నీళ్లు బాగా మరుగుతున్న క్రమంలో అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే నానబెట్టిన రేషన్ బియ్యం నీళ్లు లేకుండా వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత అందులో రాగి పిండి వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఒకే దగ్గర కాకుండా అన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
అలా కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండి, అన్నం మొత్తం కలిసేలా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు తడి లేదా నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ రాయలసీమ స్పెషల్ రెసిపీ రెడీ అయినట్టే.. దీన్ని చికెన్ కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications