కంటి చూపు తగ్గేదేలే .. ఇదిగో పాశుపతాస్త్రం!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కాపాడుకోవడానికి ముఖ్యంగా ఆహారం పైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం మన కంటి ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తుంది? కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
కళ్ళ ఆరోగ్యం కోసం ఇవి తినండి
కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా ఆకుకూరలు తినాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ ఉంటుంది. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నారింజ, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు విటమిన్ సి తో కూడుకొని ఉంటాయి. ఈ పండ్లను తినడం కంటిలోని నా రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఇవి బాగా తింటే మీ కళ్ళు హెల్దీగా ఉంటాయి
కళ్ళు బాగా కనిపించాలంటే కంటి ఆరోగ్యం బాగుండాలంటే చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అలాగే గుడ్లు కూడా కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది .ఇక మనం తీసుకునే ఆహారంలో నట్స్, సీడ్స్ కూడా మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
పప్పు ధాన్యాలతోనూ కంటి ఆరోగ్యం
మినుములు, శనగలు మరియు బీన్స్ జింక్ను అందిస్తాయి. ఇది కంటి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. జింక్ విటమిన్ Aని కాలేయం నుండి రెటినాకు రవాణా చేయడంలో సహాయపడుతుంది. పప్పు ధాన్యాలను తినడం రాత్రి దృష్టిని మెరుగుపరచడంలో, వయస్సుతో సంబంధిత మాక్యులార్ డిజెనరేషన్ను నివారించడంలో సహాయపడుతుంది.
ఆహారమే కాదు నీరు కూడా కంటి ఆరోగ్యానికి అవసరం
బాదంపప్పు, వాల్నట్స్, జీడిపప్పు వంటివి విటమిన్ ఈ తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, జింక్ లను అందిస్తాయి. ఇవి మన కంటి ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ కూడా విటమిన్ ఏ తో నిండి ఉండటం వలన మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అంతేకాదు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు తీసుకోవడం మన కంటి ఆరోగ్యానికి కీలకమైనవి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications