ఇలా చేయండి.. దెబ్బకు దరిద్రం వదిలిపోతుంది!
లవంగాలను ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వాడతారు. వీటితో అనేక వైద్య ప్రయోజనాలు కలుగుతాయి. వైద్యులు కూడా వీటిని వాడమంటూ సిఫార్సు చేస్తుంటారు. దీనిలో ఉండే శాస్త్రీయ లక్షణాలవల్ల ఔషధంగా భావిస్తారు. జ్యోతిష్యంలో కూడా లవంగం చాలా ముఖ్యమైంది. దీన్ని ఉపయోగించడంద్వారా పలు సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
అప్పుగా ఇచ్చిన డబ్బు రాకుండా ఇబ్బంది పడుతుంటే లవంగం వాడొచ్చు. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం లవంగాలు జీవితంలో ఉండే అనేక లోపాలను కూడా తొలగిస్తాయి. రాహు-కేతువుల ప్రభావాన్ని కూడా తొలగించొచ్చు. ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది. పరమ శివుడికి 40 రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో రెండు లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడంవల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది.

అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంలో 21 లవంగాలను కాల్చి, లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హవనం చేయాలి. దీనివల్ల రాహు-కేతువుల దుష్పరిణామాలు తగ్గడంతోపాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి. ఐదు లవంగాలు, ఐదు కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలగడంతోపాటు ధనధాన్యాలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications