ఏ ప్రమిదలలో దీపం పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?
కార్తీక మాసంలో దీపారాధనకు చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. దీపారాధన అంటే శరీరాన్ని, మనసుని భగవంతునికి అర్పించి జ్ఞాన జ్యోతిని వెలిగించడం. దీపావళి పండుగ నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు దీపారాధన చేయడం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి ప్రమిదలలో చేయాలి? ఏ రకం ప్రమిదలలో దీపారాధన చేస్తే ఏం ఫలితం వస్తుంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
దీపారాధన చేయడానికి మనం పూర్వం నుంచి ఇత్తడి ప్రమిదలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీపారాధనను ఇత్తడి ప్రమిదలలో చేస్తే బంగారు ప్రమిదలలో వెలిగించిన ఫలితం వస్తుందని చెబుతారు. అంతేకాదు ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. ఇక దీపారాధనను కంచు ప్రమిదలలో చేస్తే మంచిదని, కంచు ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల రోగాల బాధలు పోతాయని అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుందని చెబుతారు.

కంచు ప్రమిదలు స్టీలును పోలి ఉంటాయని చెబుతారు. పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలలో దీపారాధన చేస్తే ఆ కుటుంబానికి సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు కలిపి చేసే ప్రమిదలను పంచలోహాలు ప్రమిదలు అంటారు. ఈ ప్రమిదలలో దీపారాధన చేయడం కూడా శ్రేయస్కరం.
ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఫలితం వస్తుందని చెబుతారు. బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదను చేసి కార్తీకమాసంలో శివాలయాలలో ఎక్కువగా దీపారాధన చేస్తారు .ఇక ఈ దీపారాధనతో కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. కార్తీకమాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో తులసికోట దగ్గర దీపారాధన చేస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి.
తులసి చెట్టు వద్ద దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. వెండి ప్రమిదలలో కొంతమంది దీపారాధన చేస్తారు. వెండి ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని చెబుతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications