భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి?
ఒక్కో దేవుడుని పూజించడానికి ఒక్కో రకమైన పూలను వాడాల్సి ఉంటుంది. ఏ పూలతో పడితే ఆ పూలతో అందరు భగవంతులను పూజించకూడదు. ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలో చూడండి.
పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి ఉత్తరేణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలూ, నల్లకలువలూ మంచివి. దాసాని, మంకెన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ. ఈ పూలు పూజకు పనికి రావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు.

తమ్మి పువ్వుకు పట్టింపలేదు. మారేడు నందు శ్రీమహాలక్ష్మీ నల్లకలువ నందు పార్వతీ, తెల్లకలు వనందుకుమారస్వామీ, కమలమునందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే చదువులతల్లి సరస్వతీ దేవీ క్రాండ వాగులో కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాల్లో గౌరిదేవీ ఉంటారు.
అలాగే శ్రీమహావిష్ణు అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వు లతో సరస్వతీదేవినీ, మల్లెపువ్వులతో భైరవుడ్నీ తమ్మిపూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ మారేడుదళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్థితి లోనూ పూజింపరాదు.












Click it and Unblock the Notifications