vastu tips: రాహు కేతువుల చెడుదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉగాదినుండి ఈ పనులు చెయ్యండి!!
మన జాతకంలో రాహు కేతువుల చెడుదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉగాదినుండి మూడు నెలల పాటు కొన్ని పనులు చెయ్యాలని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ప్రతి వ్యక్తి జీవితంలో, వారి జాతకంలో రాహు కేతువుల ప్రభావం ఉంటే తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. రాహు, కేతువులను చాలా డేంజరస్ గ్రహాలుగా పరిగణిస్తారు. ఇక రాహు, కేతువులు జాతకంలో ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటే ఆ వ్యక్తి అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. జాతకంలో రాహు కేతువుల ప్రభావంతో బ్రతుకు దుర్భరంగా మారుతుంది. అయితే జీవితాంతం మన జీవితంలో రాహుకేతువుల ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే ఉగాది నుంచి నిష్టగా కొన్ని పనులు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రాహు కేతువుల చెడు దృష్టి మనపై ఉండదని సూచిస్తున్నారు.

ఉగాది నుండి మూడు నెలల పాటు రాహు కేతువుల పరిహారం
ఇంతకీ రాహు కేతువుల ప్రభావం నుండి జీవితాంతం బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఉగాది నుండి మూడు నెలల పాటు అమ్మవారిని పూజిస్తూ కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. చైత్ర నవరాత్రులు మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 30వ తేదీన ముగుస్తాయి. ఈ చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. అయితే మన జాతకంలో రాహువు మరియు కేతువు అశుభాలను కలిగించే స్థాయిలో ఉంటే వాటిని శాంతపరచడానికి చైత్ర నవరాత్రుల నుండి కొన్ని పరిహారాలు చేయాలని సూచించబడింది.

చైత్ర నవరాత్రులలో అమ్మ వారిని పూజించాలి
రాహువు మరియు కేతువు జాతకంలో ఉంటే అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు, వృత్తిలో వైఫల్యం, ప్రేమ లేకపోవడం, ప్రతి చిన్న దానికి గొడవలు కావడం వంటి అనేక సమస్యలు రాహు, కేతు దోషాలతో కలుగుతాయి. ఇక ఈ సమస్యలు తొలగిపోవాలంటే రాహు దోషం ఉన్నవారు బ్రహ్మచారిణి అమ్మవారిని అత్యంత నియమ నిష్ఠలతో పూర్తి ఆచారాలతో పూజించాలి. ఇక కేతువు ప్రభావం ఎక్కువగా ఉన్నవారు చంద్రఘంట అమ్మవారిని పూజించాలి.

ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఈ పని చెయ్యండి
ఇక అంతేకాదు చైత్ర నవరాత్రుల నుండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం గంధం పొడిని కలుపుకొని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు స్నానం చేయాలి. దీనివల్ల రాహు, కేతువుల చెడు దృష్టి ప్రభావం కొంత మేరకు తగ్గుతుంది. అంతేకాదు నవరాత్రులలో దుర్గామాత సమేతంగా హనుమంతుడిని, పరమశివుడిని పూజించాలి. ప్రతిరోజు శివుడి సహస్రనామాన్ని, హనుమాన్ సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల కూడా రాహు, కేతువుల ప్రభావం వల్ల కలిగే ప్రతికూలతలు కొంతమేర తగ్గుతాయి.

చైత్ర నవరాత్రులలో ఈ వస్తువును తెచ్చి ఇంట్లో పెట్టుకోండి
చైత్ర నవరాత్రులలో భాగంగా జరిపే దుర్గా నవరాత్రులలో తొమ్మిదవ రోజు దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల రాహు కేతువుల దుష్ఫలితాలు తగ్గుతాయి. దుర్గా సప్తశతి పఠించటం వల్ల దుర్గాదేవికి సంతోషం కలుగుతుంది. దుర్గాదేవి రాహు, కేతువుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు రాహువు ప్రభావం తగ్గాలంటే చైత్ర నవరాత్రులలో వెండి ఏనుగును కొనుగోలు చేసి దానిని దేవుని గదిలో కానీ, ఖజానాలో కానీ పెట్టుకుంటే రాహువు యొక్క చెడు ప్రభావం బాగా తగ్గుతుంది. ప్రతిరోజు ఈ వెండి ఏనుగును చూడడం వల్ల మంచి జరుగుతుంది. ఇక వృత్తిలో గణనీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications