వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెరూలో భారీ భూకంపం-47మంది మృతి
లీమా: దక్షిణ పెరూలో ఆదివారంఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 47మందికి పైగా మరణించారు. 550 మందికిపైగాగాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ భూకంపం రెక్టార్స్కేల్పై 7.9గా నమోదయింది. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇల్లుకూలిపోయాయి. బోలివియాలో కూడా భూకంపం వచ్చింది.పెరూలోని భూకంపం ప్రభావం చిలీపై కూడాపడింది.
ఉత్తర చిలీలో భూమి కంపించి 30మంది గాయపడ్డారు. ఇది రెక్టార్ స్కేల్పై రెండుగానమోదయింది. పెరూలో భూకంపం సంభవించి భవంతులన్నీ కూలిపోవడంతోశిథిలాల కింద ఎంత మంది ఉన్నారనే విషయం కూడా లెక్క తేలడంలేదు. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.పెరూలో చారిత్రాత్మక చర్చిలు నేల మట్టమయ్యాయి.
Story first published: Sunday, June 24, 2001, 23:53 [IST]