కదంబం
అహ్మదాబాద్ః గుజరాత్ ముఖ్యమంత్రిగా బిజెపిసీనియర్ నాయకుడు నరేంద్ర మోడి ఎన్నికకు రంగం సిద్ధంఅయింది. అధిష్ఠానం ఆగ్రహానికి గురై గద్దె దిగిన కేశూభాయ్ పటేల్ మొదట మొరాయించినా చివరకు నరేంద్ర మోడీతో భాయీ భాయ్ అనడంతో గురువారం నాడు లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగామిగిలింది. కేశూభాయ్ రాజీనామా చేసిన వెంటనే నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి పదవిఅప్పగిస్తే పార్టీకే గుడ్ బై చెబుతానని హెచ్చరించారు. అయితేసి.ఎం. ఎవరనే నిర్ణయాన్ని రాష్ట్ర నేతలంతా ప్రధాని వాజ్పేయికే వదిలేశారు. గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ఉత్సాహవంతుడైన నేత అవసరమని భావించిన వాజ్పేయి కేశూభాయ్ ని గద్దె దించారు. కేశూభాయ్ గద్దె దిగడంతో జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్న నరేంద్ర మోడికి ఛాన్స్ దక్కుతుందనిఅంతా భావించారు.
అయితే కేశూభాయ్ నరేంద్ర మోడి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో మోడి ఎంపిక ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంఅయింది. వాజ్ పేయి మొదలు కొని బిజెపి సీనియర్ నేతలంతా కేశూభాయ్ కి నచ్చచెప్పారు. దీనితో కేశూభాయ్ నరేంద్ర మోడికిస్వీట్స్ తినిపించి చేయీ చేయీ కలిపారు. అందుక కృతజ్ఞతగా మోడి ఏకంగా కేశూభాయ్ పాదాలమీదే పడ్డారు. గుజరాత్ లో నానాటికీ క్షీణిస్తున్న బిజెపిలో నూతనోత్తేజం రగిలిస్తాడనే ఆశతో వాజ్పేయి ఆయనకు సి.ఎం. పదవి అప్పగిస్తున్నారు. వాజ్పేయి ఆశలను మోడి ఏ మాత్రం పండిస్తారో వేచి చూడాలి.