రకుమార్ dురు బగున్నార
ర
ఇస్లామాబాద్ః ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తునే వున్నది. సోమవారం ఉదయం కూడా అమెరికా బాంబర్లు కాబూల్ పై బాంబులు కురిపించాయి. ఆఫ్ఘన్ ఉత్తర ప్రాంతంపై అమెరికా యుద్ధ మానాలు దృష్టి కేంద్రీకరించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులు ప్రారంభించి సోమవారం నాటికి ఐదు వారాలు పూర్తయింది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కార్పెట్ బాంబింగ్ జరిపి నార్తరన్ అలయెన్స్ కు మార్గం సుగమం చేయాలన్నదే అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది.
ఇప్పటికే పలు ప్రాంతాలనుస్వాధీనం చేసుకున్నామని త్వరలో మజారే షరీఫ్ నుస్వాధీనం చేసుకుంటామని నార్తరన్ అలయన్స్ నేతలు వెల్లడించారు. యుద్ధం ఊపందుకోగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాల మద్దతు సంపాదించేందుకు అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్ఫీల్డ్ తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో స్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ వారంలో రమ్స్ఫీల్డ్ పాకిస్తాన్, భారత్ లలో కూడా పర్యటించనున్నారు.