బ్రిక్స్ విందుపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.. 80 శాతం భారతీయులు నాన్ వెజ్ ప్రియులేనంటూ..
దేశ రాజధాని దిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా బ్రిక్స్ సమావేశం విజయవంతంగా జరిగింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన ఈ సమావేశానికి 11 సభ్య దేశాల అధినేతలు, 10 భాగస్వామ్య దేశాలు అలాగే 11 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిక్స్ సమ్మిట్ తొలి రోజున న్యూ దిల్లీ డిక్లరేషన్ ను బ్రిక్స్ దేశాలు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఏకగ్రీవంగా ఆమోదించాయి. అనంతరం భారత్ మండపంలో బ్రిక్స్ దేశాల అధినేతలు, ప్రతినిధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ గాలా డిన్నర్ లో పలు దేశీయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ విందులో పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. దేశంలో దాదాపు 80 శాతం మంది నాన్- వెజ్ ప్రియులు ఉన్నారని వివరించారు. అలాగే భారత్ లోని నాన్- వెజ్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయని అన్నారు.
For the record: 80% of Indians are non-vegetarian.
— Rahul Gandhi (@RahulGandhi) September 13, 2026
Indian non-vegetarian food is delicious. As are my sister's chole bhature. pic.twitter.com/8f6ziKjLan
తన అధికారిక ఎక్స్, ఇన్ స్టా ఖాతాల్లో రాహుల్ గాంధీ ఇలా పోస్టు పెట్టారు. "ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం.. మన దేశంలో 80 శాతం మంది భారతీయులు నాన్ వెజ్ తింటారు. భారత్ లోని నాన్ వెజ్ వంటకాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. అవి ఎంత రుచిగా ఉంటాయంటే మా సోదరి (ప్రియాంక గాంధీ) చేసే చోలే భటూరే మాదిరిగా అద్భుతంగా ఉంటాయి.. అంటూ ఆసక్తికర పోస్టు పెట్టారు. అంతేకాక డైనింగ్ టేబుల్ పై చోలే భటూరే ఉన్న ఫొటోను పోస్టు చేశారు. భారత్ మండపంలో బ్రిక్స్ దేశాధినేతలకు పూర్తిగా వెజ్ వంటకాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఇక శనివారం రాత్రి బ్రిక్స్ ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో స్టార్టర్స్ గా గుజరాతీ సంప్రదాయ వంటకాలైన ఖండ్వీ మిల్లే- ఫుయెల్లీ, ఖుంబ్ గలౌటీ, అలాగే మెయిన్ కోర్స్ లో పనీర్ లబాబ్దర్, గుచ్చీ మార్మిక్, క్యారెట్ బీన్ పొరియాల్, తక్కలి బెల్లె చారు వంటి పూర్తి వెజిటేరియన్ వంటకాలను రుచిచూపించారు. ఇక జర్ట్గా ఓల్డ్ ఢిల్లీ స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ జిలేబీ, షహతూత్ ఫిర్నీలను అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే నవరస- భావోద్వేగాల విశ్వం పేరిట దాదాపు 120 మంది కళాకారులతో దేశంలోని విభిన్న సంగీత సంప్రదాయలు, వాయిద్యాలను మేళవించి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
