బ్లోయెమ్‌ ఫోంటీన్‌ః దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్‌ మొదట కాస్త తడబడినప్పటికీ సచిన్‌, dరేంద్రసెహవాగ్‌ సెంచరీలతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 60 పరుగులకే నాలుగు కెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌, తొలిటెస్ట్‌ ఆడుతున్న dరేంద్రసెహవాగ్‌ ఆదుకున్నారు. ఐదో కెట్‌ కు భారీగా 220 పరుగుల భాగస్వామ్యాన్నిఅందించి భారత్‌ పరువు నిలిపారు. తొలిత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ జట్టు రెండో ఓవర్‌ లోనే ద్రాడ్‌ కెట్‌ కోల్పోయింది.

ఓపెనర్‌ గా వచ్చిన ద్రాడ్‌ మూడు పరుగులకు స్లిప్‌ లో క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత బరిలోకి దిగిన లక్ష్మణ్‌ ధాటిగా ఆడాడు. నాలుగు ఫోర్లు, ఓసిక్స్‌ తో 30 బంతుల్లలో 32 పరుగులు సాధించాడు. దూకుడుగా ఆడుతున్న లక్ష్మణ్‌ కు హేవార్డ్స్‌ కళ్ళెం వేశాడు.

ఆ తరువాత దాస్‌, కెప్టెన్‌ గంగూలీ కూడా పెలియన్‌ దారి పట్టారు. 64 పరుగులకు నాలుగు కెట్లు కోల్పోయిన భారత్‌ ను గట్టెంకించే బాధ్యతను సచిన్‌ భుజాలపై వేసుకున్నాడు. సచిన్‌ కుసెహవాగ్‌ చక్కటి మద్దతునిచ్చాడు. సచిన్‌ 155 పరుగులు,సెహవాగ్‌ 105 పరుగులు సాధించి అవుటయ్యారు. గవాస్కర్‌ తరువాత టెస్టుల్లో 7 వేల పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సచిన్‌ చరిత్ర సృష్టించాడు. తొలిటెస్ట్‌ లోనేసెంచరీ సాధించిన అతి కొద్ది మంది జాబితాలోసెహవాగ్‌ చేరాడు. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 7 కెట్లు కోల్పోయి 372 పరుగులు చేసింది.

ఆదివారం ఆట ప్రారంభమయ్యాకు అతి పేలవంగా భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఐదు ఓవర్లు మాత్రమే ఆడి భారత్‌ ుగిలిన కెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన గిబ్స్‌, కీర్‌ స్టన్‌ నింపాదిగా ఆడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+