వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్లోయెమ్ ఫోంటీన్ః దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తున్నది. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 379 పరుగులకు ఆలౌట్అయింది. అందుకు సమాధానంగా బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓపెనర్లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్ హర్షల్ గిబ్స్సెంచరీ సాధించాడు. గారీ కీర్ స్టన్ 73 పరుగులు సాధించి కుంబ్లే బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ వెంటనే శ్రీనాధ్ బౌలింగ్ లో గిబ్స్ 107 పరుగలు వద్ద అవుటయ్యాడు.
సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ పై భారత్ బౌలర్లు ఎవరూపెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. టీ రామ సమయానికి సౌతాఫ్రికా జట్టు రెండు కెట్లు నష్టానికి 213 పరుగులు చేసింది. భారీ బ్యాటింగ్ ఆర్డర్ వున్న సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త గుగ్లీతో తడాఖా చూపుతానని చెప్పిన కుంబ్లే కూడా సౌతాఫ్రికా బౌలర్లపైపెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. మూడో రోజు మ్యాచ్ లోఅయిన బంతి స్పిన్ అవుతుందేమో వేచి చూడాలి.
Comments
Story first published: Sunday, November 4, 2001, 23:53 [IST]